భారత జట్టు మాజీ క్రికెటర్, తూర్పు ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ గౌతమ్ గంభీర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోక్సభ ఎన్నికల ఆరో విడతలో భాగంగా ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. గంభీర్ తూర్పు ఢిల్లీ నియోజకవర్గంలో ఓటు వేశారు.
ఓటు వేసిన అనంతరం ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గంభీర్ కోరారు. ఓటు హక్కు ప్రజల శక్తి అని అన్నారు. గత పదేళ్ల బీజేపీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చేసిందని గంభీర్ అన్నారు.