మొన్నటివరకు హైదరాబాద్ మెట్రోపై ప్రజలు భారీ ఆదరణ చూపారు. మెజారిటీ ప్రయాణికులు మెట్రో ఆశ్రయించారు. ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యింది. మెట్రోకు క్రమంగా ప్రయాణికులు తగ్గుతున్నారు. ముఖ్యంగా మహిళా ప్రయాణికులు మెట్రో వినియోగాన్ని తగ్గిస్తున్నారు. దీనికి కారణం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం పథకమే. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకంలో మెట్రోకు నష్టం పెరిగిందని ఎల్ అండ్ టీ ప్రెసిడెంట్ శంకర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.