పేదల ఇళ్లను కూలగొడితే జైలు పాలవ్వడం ఖాయం: ఈటెల రాజేందర్

81చూసినవారు
పేదల ఇళ్లను కూలగొడితే జైలు పాలవ్వడం ఖాయం: ఈటెల రాజేందర్
ప్రజలను, చట్టాలను పట్టించుకోకుండా పేదల ఇళ్లను కూలగొడితే జైలు పాలవ్వడం ఖాయమని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హెచ్చరించారు. శుక్రవారం మూసీ సుందరీకరణ పేరిట ఇళ్లు కోల్పోతున్న వారితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధికారంలో ఉండేది 5 ఏళ్లు మాత్రమేనని, అధికారులు మాత్రం 35 ఏళ్లు సర్వీసులో ఉంటారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. పైసా పైసా కూడబెట్టి ప్రభుత్వం అనుమతితోనే ఇళ్లను కట్టుకుంటే అక్రమంగా కూల్చేస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్