ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్

55చూసినవారు
ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్
లంచం తీసుకుంటూ విజయనగరం మండల డిప్యూటీ తహశీల్దార్ కొార్ కొట్నాన శ్రీనివాసరావు ఏసీబీకి చిక్కాడు. స్థలానికి సంబంధించిన సర్వే నెంబర్ ఎండార్స్మెంట్ కోసం రైతు నుంచి పది వేలు లంచం డిమాండ్ చేశాడు. వెంటనే ఆ రైతు ఏసీబీని ఆశ్రయించాడు. దాంతో ఏసీబీ అధికారులు తహశీల్దారు కార్యాలయంలో దాడులు నిర్వహించారు. ఈ మేరకు రైతు నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్