చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొత్త కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ నియమితులయ్యారు. గతేడాది ట్రోఫీ అందించిన తలైవా ధోనీని కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించడంతో ఫ్యాన్స్ షాక్కు గురయ్యారు. రేపటి నుంచి ఐపీఎల్ సిరీస్ ప్రారంభం కానున్న తరుణంలో సీఎస్కే జట్టు కెప్టెన్ని ఒక్కసారిగా మార్చడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ధోనీ మళ్లీ కెప్టెన్గా కొనసాగాలని అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తున్నారు.