కొమురవెల్లికి పోటెత్తిన భక్తులు

71చూసినవారు
కొమురవెల్లికి పోటెత్తిన భక్తులు
TG: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. ‘మల్లన్న స్వామి మమ్మేలు స్వామి’ అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవక్షేత్రం పులకరించింది. ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళా భక్తులు పెద్దసంఖ్యలో మల్లన్నక్షేత్రానికి తరలివచ్చారు. దాదాపు 10వేలమంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ ఈవో బాలాజీశర్మ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్