గురుకుల పాఠశాల విద్యార్థులకు అతిసార వ్యాధి

50చూసినవారు
గురుకుల పాఠశాల విద్యార్థులకు అతిసార వ్యాధి
ఏపీలోని అనంతపురం జిల్లా గుత్తి మండలం రజాపురంలో విద్యార్థులకు అతిసార వ్యాధి ప్రబలింది. అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాలలో దాదాపు 40 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇవాళ కూడా మరో 25 మందికి అస్వస్థత కలిగింది. అయితే, వసతిగృహంలో అతిసార వ్యాధి వ్యాప్తిని గోప్యంగా ఉంచిన అధికారులు బాధిత విద్యార్థులకు వసతి గృహంలోనే చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్