వరదల బీభత్సం.. 60 మంది మృతి

59చూసినవారు
వరదల బీభత్సం.. 60 మంది మృతి
ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. వరదల బారిన పడిన అసోం, అరుణాచల్ రాష్ట్రాల ప్రజలు సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. వరదల కారణంగా అసోంలో సుమారు మూడు లక్షల మంది నిరాశ్రయులుగా మారగా, 60 మంది మృత్యువాత పడ్డారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో నీటిమట్టం పెరిగింది. ఫలితంగా నగాంవ్, డిబ్రుగఢ్ తదితర జిల్లాలు నీట మునిగాయి.

సంబంధిత పోస్ట్