జూన్‌ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ

55చూసినవారు
జూన్‌ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ
ప్రతి సంవత్సరం మృగశిర కార్తె సందర్భంగా బత్తిని కుటుంబ సభ్యులు చేప ప్రసాదం పంపిణి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈసారి కూడా చేప ప్రసాదం పంపిణి కార్యక్రమం సాగుతుందని బత్తిని కుటుంబం వెల్లడించింది. హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో చేపప్రసాదం అందిస్తామని వారు తెలిపారు. ఈ ఏడాది మృగశిర కార్తె సందర్భంగా జూన్‌ 8వ తేదీన చేప ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఈ చేపమందు పంపిణీ మొదలవుతుందని వారు చెప్పారు.

సంబంధిత పోస్ట్