సార్వత్రిక ఎన్నికల ఐదో విడత పోలింగ్ ఇవాళ సాయంత్రం ముగిసింది. దేశంలోని 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఇప్పటివరకు 5 విడతల్లో 430 లోక్సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఇక ఈనెల 25న ఆరో విడత, జూన్ 1న ఏడో విడత పోలింగ్ జరుగనుంది. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుంది.