టీ20 వరల్డ్ కప్ కామెంటేటర్ల జాబితాను ఐసీసీ ప్రకటించింది. 41 మంది సభ్యులున్న ఈ ప్యానెల్లో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ దేశాలకు చెందిన దిగ్గజాలు ఉన్నారు. భారత మాజీ కోచ్ రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, దినేశ్ కార్తీక్, హర్ష, పాంటింగ్, వసీం అక్రమ్, స్టీవ్ స్మిత్ వంటి వారు ఉన్నారు. కాగా డీకే ఇటీవలే ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయన గతంలో వరల్డ్ కప్ 2023, యాషెస్ సిరీస్లోనూ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.