నవంబర్ 1-19 మధ్య ఎయిరిండియాలో ప్రయాణించొద్దు.. పన్నూ వార్నింగ్

80చూసినవారు
నవంబర్ 1-19 మధ్య ఎయిరిండియాలో ప్రయాణించొద్దు.. పన్నూ వార్నింగ్
దేశంలో గత కొన్ని రోజులుగా విమానాలకు బాంబు బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాల వేళ ఖలిస్థానీ వేర్పాటువాది గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూ.. ‘ఎయిర్‌ ఇండియా’కు హెచ్చరికలు జారీ చేశాడు. నవంబరు 1 నుంచి 19 వరకూ ఎయిర్‌ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దని అతడు హెచ్చరించాడు. సిక్కు మారణహోమం జరిగి 40 ఏళ్లు కావొస్తోన్న నేపథ్యంలో ఎయిరిండియా విమానాలపై దాడి జరగొచ్చని ఓ వీడియో సందేశంలో పేర్కొన్నాడు.

సంబంధిత పోస్ట్