అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి వేడుకల్లో భాగంగా బుధవారం రాత్రి అంబానీ ఫ్యామిలీ ‘మామెరు’ వేడుక నిర్వహించారు. ఈ ఫంక్షన్లో పెళ్లికూతురు రాధిక.. ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా రూపొందించిన రాణీ పింక్ లెహంగాలో మెరిసిపోయారు. ఈ లెహంగా బోర్డర్పై దుర్గాదేవి శ్లోకాలను బంగారు తీగలతో ప్రత్యేకంగా ఎంబ్రాయిడరీ చేశారు. ఈ ఫంక్షన్లో రాధిక తన తల్లి నగలను వేసుకున్నారు.