నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

85చూసినవారు
నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం సెన్సెక్స్‌ 144 పాయింట్లు నష్టపోయి 71,747 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు తగ్గి 21,630 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.31 వద్ద ప్రారంభమైంది. ఐటీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, నెస్లే ఇండియా, రిలయన్స్‌, హెచ్‌యూఎల్‌, ఎంఅండ్‌ఎం, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

సంబంధిత పోస్ట్