ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి వస్తున్న పుకార్లపై ఢిల్లీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సంక్షేమ పథకాలు, సబ్సిడీలు ఆగిపోతాయనే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అబద్దపు ప్రచారం నమ్మొద్దని, నేర పరిశోధన విషయంలోనూ చట్టం తన పని తాను చేస్తుందని, పథకాలు, పాలన ఏవీ ఆగవని స్పష్టం చేసింది.