డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ కోల్కతా కార్పొరేషన్ మేయర్గా ఉన్న సమయంలో ఉచిత విద్య, వైద్య సాయం, మరుగుదొడ్లు, వీధి దీపాలు, నీటి సరఫరా వంటివి ప్రజలకు అందించడంలో సాయపడ్డారు. 1961లో తన ఇంటిని సైతం ఆయన ప్రజలకు బహుమతిగా ఇచ్చారు. భారత ప్రభుత్వం 1961 ఫిబ్రవరి 4 న ఆయనను ‘భారతరత్న’తో గౌరవించింది. వైద్యరంగంలో చేసిన సేవలకుగాను 1976 లో ‘రాయ్ జాతీయ అవార్డు’ను స్ధాపించారు. ఆయన సేవల్ని ఏటా స్మరిస్తూ జూలై 1 న ‘జాతీయ వైద్యుల దినోత్సవాన్ని’ జరుపుతారు.