ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్

79చూసినవారు
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. రౌస్ అవెన్యూ కోర్టు ఆయన్ను జులై 12 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన దీనిని వ్యతిరేకిస్తూ, హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా, ఇటీవల కేజ్రీవాల్‌ను మూడు రోజుల కస్టడీకి పంపగా, అది ఈ శనివారంతో ముగిసింది. దీంతో రౌస్ అవెన్యూ కోర్టు ఆయన్ను తిరిగి జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్