మమతా బెనర్జీ ప్రభుత్వం ఏం చేస్తోంది: జేపీ నడ్డా

62చూసినవారు
మమతా బెనర్జీ ప్రభుత్వం ఏం చేస్తోంది: జేపీ నడ్డా
దాడులు జరుగుతుంటే మమతా బెనర్జీ ప్రభుత్వం ఏం చేస్తోందని బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్‌ ఉద్రిక్తతలపై తాజాగా ఆయన స్పందించారు. బెంగాల్‌లో మహిళలకు భద్రత లేదని ఎక్స్‌లో పోస్టు చేశారు. మతం పేరుతో చేస్తున్న దారుణానికి ఇటీవల జరిగిన ఘటన నిదర్శనం అన్నారు. కాగా, వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న కారణంతో బెంగాల్‌లో ఓ జంటపై తీవ్ర దాడి జరిగింది. దీనిపై ఆయన విమర్శలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్