బెంగళూరులో రూ.21 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం

78చూసినవారు
బెంగళూరులో రూ.21 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం
బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గురువారం రూ.21 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫారిన్ పోస్ట్ ఆఫీస్ వద్ద పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. 606 డ్రగ్స్‌ పార్శిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అమెరికా, బెల్జియం, యూకే, థాయ్‌లాండ్, నెదర్లాండ్స్ వంటి దేశాల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్