రైలులో ప్రయాణిస్తుండగా ఓ సైనికుడు తాగిన మత్తులో తన బెర్త్ పై మూత్ర విసర్జన చేశాడని, నిద్రిస్తున్న సమయంలో అది తనపై పడిందని ఓ మహిళ ఆరోపించింది. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి ఛత్తీస్గఢ్లోని దుర్గ్కు వెళ్తున్న గోండ్వానా ఎక్స్ప్రెస్లో ఈ ఘటన జరిగింది. ఈ విషయమై బాధితురాలు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కు ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోలేదని.. ప్రధానమంత్రి కార్యాలయం మరియు రైల్వే మంత్రికి ఫిర్యాదు చేసింది.