కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ గుండెపోటుతో ఇవాళ కన్నుమూశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డీఎస్ 1948 సెప్టెంబర్ 27న జన్మించారు. ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్లో పని చేసి 1989లో నిజామాబాద్ అర్బన్ నుంచి తొలి సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1998లో ఉమ్మడి ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా సేవలు అందించారు. 2004, 2009లో మంత్రిగా సేవలందించారు. రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ లో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు.