గత ప్రభుత్వంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను BRS సమర్థించుకునే ప్రయత్నం చేస్తోందని TJS అధినేత ప్రొ. కోదండరాం అన్నారు. గతేడాది వచ్చిన వరదలకు భద్రాద్రి ప్లాంట్ లో ఉత్పత్తి ఆపేయాల్సి వచ్చిందని.. నీటిమట్టం పెరిగితే ప్లాంట్ ను కాపాడుకోలేమని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వ తొందరపాటు వల్ల ట్రాన్స్కో, జెన్కోలు రూ.81 వేల కోట్ల అప్పులయ్యాయని జస్టిస్ నరసింహారెడ్డి కమిషనన్ ను కలిసిన సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.