సూరత్లో లక్ష్మీపార్క్ సొసైటీ వద్ద శుక్రవారం తెల్లవారు జామున ఇ-బైక్ పేలింది. దీంతో షార్క్సర్క్యూట్ సంభవించి మంటలు వ్యాపించాయి. అదే సమయంలో సిలిండర్ పేలడంతో మహిమ (18) అనే యువతి చనిపోయింది. ఇక ఇంటి మొదటి అంతస్తులో నిద్రిస్తున్న కుటుంబసభ్యులకు మంటలు వ్యాపించాయి. మహిమ తల్లి చంపా సిర్వి (42), తండ్రి డోలారం సిర్వి (46), తోబుట్టువులు దేవిక (14), చిరాగ్ (8) తీవ్రంగా గాయపడ్డారు.