భారతీయ బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకుని విదేశాలకు పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యా అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో జన్మించాడు. వెల్లింగ్టన్ కాలేజ్, క్వీన్స్మేరీ వర్సిటీల్లో(యూకే) చదువుకున్నాడు. మోడల్, యాక్టర్గా కెరీర్ మొదలుపెట్టాడు. 'బెస్ట్ ఫేక్ ఫ్రెండ్స్' తదితర చిత్రాల్లో నటించారు. మానసిక ఆరోగ్యంపై పుస్తకాలు కూడా రాశాడు. ఐపీఎల్లో ఆర్బీసీ జట్టుకు డైరెక్టర్గా పనిచేశాడు.