తెలంగాణలో ఇలాంటివి జరగకుండా చూసుకుందాం: కేటీఆర్

76చూసినవారు
తెలంగాణలో ఇలాంటివి జరగకుండా చూసుకుందాం: కేటీఆర్
తమిళనాడులో కల్తీ మద్యం తాగి దాదాపు 38 మంది మృతి చెందిన ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించింది. ఈ నేప‌థ్యంలో తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. 'తెలంగాణలో ఇలాంటివి జరగకుండా చూసుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం చౌకైన మ‌ద్యం బ్రాండ్‌లను రాష్ట్రంలో ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడదని భావిస్తున్నా' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్