ప్రధాని మోదీకి దీదీ లేఖ

76చూసినవారు
ప్రధాని మోదీకి దీదీ లేఖ
ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ చట్టాల అమలు తేదీని వాయిదా వేయాలని ఆ లేఖలో కోరారు. ఈ క్లిష్టమైన బిల్లులపై ఎటువంటి చర్చ లేకుండానే లోక్‌సభలో ఆమోదించారని పేర్కొన్నారు. ఈ కొత్త చట్టాలకు సంబంధించి ప్రజల్లో విస్తృత అనుమానాలు ఉన్నాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్