హిమాచల్ ప్రదేశ్లో శుక్రవారం భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 3.39 గంటలకు కులులో భూప్రకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.0గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. అయితే భూకంపం వల్ల ఆ ప్రాంతంలో ఆస్తి, ప్రాణ నష్టం ఏర్పడినట్లు సమాచారం లేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.