మహారాష్ట్రలోని నాందేడ్ లో భూకంపం

61చూసినవారు
మహారాష్ట్రలోని నాందేడ్ లో భూకంపం
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో మంగళవారం మోస్తారు భూకంపం సంభవించింది. నాందేడ్ నార్త్ సిటీ, హద్గావ్, అర్ధపూర్ తాలూకాలోని కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.8గా నమోదైంది. నాందేడ్ నగరానికి ఈశాన్యంగా 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న హడ్‌గావ్ తాలూకాలోని సావర్‌గావ్ గ్రామంలో భూకంప కేంద్రం ఉంది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని జిల్లా ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ అధికారి కిషోర్ కుర్హే తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్