బాలీవుట్ నటి క్రిస్టల్ డిసౌజాకు ED సమన్లు పంపింది. OctaFx ట్రేడింగ్ యాప్ అక్రమంగా ఆన్లైన్ ఫారెక్స్ ట్రేడింగ్కు పాల్పడడంతో ED మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో ఏప్రిల్లో ముంబై, చెన్నై, కోల్కతా, ఢిల్లీలలో ED పలు సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించింది. సోషల్ మీడియాలో OctaFxకు ప్రచారం చేశారనే కారణంతో క్రిస్టల్ డిసౌజాతో పాటు నటుడు కరణ్ వాహికి ED తాజాగా సమన్లు పంపించింది. వారిని విచారణకు పిలిచింది.