తెలంగాణలో వీరందరికీ రైతు భరోసా కట్?

67చూసినవారు
తెలంగాణలో వీరందరికీ రైతు భరోసా కట్?
తెలంగాణలో నేటి నుంచి ప్రభుత్వం వ్యవసాయ భూముల సర్వే చేపడుతోంది. రైతు భరోసా పథకానికి అనర్హులను ఏరివేసేందుకు ప్రభుత్వం విధివిధాలు రూపొందిస్తోంది. ఐటీ చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు, బీడు భూములు, రోడ్లు, రియల్ వెంచర్లకూ ఈ పథకం వర్తించకూడదని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన సర్వే 10 రోజుల్లోగా పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. కాగా ఆగస్టు 15లోగా రైతుభరోసా ఇవ్వనుంది.

సంబంధిత పోస్ట్