మహారాష్ట్రలోని ముంబై-నాగ్పూర్ ఎక్స్ప్రెస్వేపై శనివారం ఘోర ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.