ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి (వీడియో)

21465చూసినవారు
హైదరాబాద్‌ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మ కాలనీలో ఘోర ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న భవనం సెంట్రింగ్ పడి కార్మికుల షెడ్ రిటర్నింగ్ వాల్ కూలిపోవడంతో పెద్ద సంఖ్యలో కార్మికులు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఏడుగురి మృతదేహాలను వెలికితీశారు. మృతులు ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో ఓ మహిళ, నాలుగేళ్ల బాలుడు ఉన్నాడు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్