ఘోర రోడ్డుప్రమాదం.. 8 మంది మృతి

364228చూసినవారు
ఘోర రోడ్డుప్రమాదం.. 8 మంది మృతి
హర్యానాలో శనివారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బీబీపూర్‌లోని జింద్ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు, క్రూయిజర్ ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 8 మంది సంఘటనా స్థలంలోనే చనిపోయారు. మరో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రమాద తీవ్రతకు క్రూయిజర్ తుక్కుతుక్కు అయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్