చత్తీస్ఘఢ్ రాజధాని రాయ్పూర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్లో శుక్రవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో సెంటర్ నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్ధలానికి అగ్నిమాపక యంత్రాలు చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.