చెన్నై ఘోర ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి సిరుసేరికి వెళ్తున్న ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంజన్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను కిందకు దించాడు. సంఘటనా స్థలంలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకుని చాలా సేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.