తూర్పు తైవాన్లోని హువాలియన్ కౌంటీలోని షౌఫెంగ్ టౌన్షిప్లో సోమవారం వరుస భూకంపాలు సంభవించాయి. కేవలం 9 నిమిషాల వ్యవధిలో 5 సార్లు భూమి కంపించింది. రెండు వారాల క్రితం, రిక్టర్ స్కేల్పై 7.4 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం తైవాన్ తూర్పు తీరంలో వచ్చింది. ఈ భూకంపం వల్ల నలుగురు చనిపోయారు. 700 మందికి పైగా గాయపడ్డారు. వరుస భూకంపాలతో తైవాన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.