రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలువురికి నేడు పద్మ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరగనుంది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన పలువురికి పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించనున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఈరోజు 67 మందికి పద్మ పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.