మహారాష్ట్ర నాసిక్లో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం ఓ ద్విచక్ర వాహనాల గోడౌన్లో పెద్దఎత్తున మంటలు చెలరేగటంతో 70కిపైగా బైక్లు కాలిపోయాయి. పక్కనే ఉన్న నాలుగు ఇళ్లకు కూడా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న సిబ్బంది 9 అగ్నిమాపక యంత్రాలలతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.