ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధరంగంగా పేరొందిన సియాచిన్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ ఈరోజు పర్యటించారు. సైన్యం యుద్ధం సన్నద్ధతను ఆయన సమీక్షించారని, సైనికులతో ముచ్చటించారని అధికారులు తెలిపారు. రాజ్నాథ్ వెంట ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఉన్నారు. సియాచిన్లో భారత సైన్యం ఉనికి మొదలై ఈ ఏడాదికి 40 ఏళ్లు గడిచాయి. 1984లో 'ఆపరేషన్ మేఘ్దూత్'తో ఆ ప్రాంతాన్ని భారత్ స్వాధీనం చేసుకుంది.