మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ 1966 అక్టోబర్ 20న జన్మించారు. టీడీపీ తరపున 1999లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో ఆ పార్టీ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా గెలిచారు. 2006–09 మధ్య జిల్లా పరిషత్ ఛైర్మన్గా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో BRSలో చేరారు. అనంతరం కాంగ్రెస్లో చేరి 2019లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2021లో బీజేపీ కండువా కప్పుకున్నారు. కాగా.. రమేశ్ రాథోడ్కు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.