కాల్పుల కలకలం.. నలుగురు మృతి

79చూసినవారు
కాల్పుల కలకలం.. నలుగురు మృతి
ఒమన్‌లోని వాడీ అల్ కబీర్ ప్రాంతంలోని మసీదు సమీపంలో జరిగిన కాల్పులు కలకలం రేపాయి. ఇవాళ తెల్లవారుజామున ఈ కాల్పులు జరుగగా.. కాల్పుల్లో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు పోలీసులు సంతాపం ప్రకటించారు. మసీదు దగ్గర భద్రత పెంచామని, కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్