ఇద్దరు బాలికల వెంటపడిన నలుగురు దుండగులు.. షాకింగ్ వీడియో

70చూసినవారు
యూపీలోని డియోరియా జిల్లాలో దారుణ ఘటన జరిగింది. నలుగురు దుండగులు సైకిళ్లపై వెళ్తున్న ఇద్దరు బాలికలను వేధించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మేరకు ఒకే బైక్‌పై 4 దుండగులు వెళ్తుండగా వారికి సైకిళ్లపై వస్తున్న ఇద్దరు బాలికలు ఎదురుపడ్డారు. వెంటనే దుండగులు బైక్ ఆపి బాలికలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ బాలికలు కేకలు వేస్తూ పరుగెత్తడంతో దుండగులు పరారయ్యారు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్