ప్రైవేటు ఉపాధ్యాయుల డిమాండ్ల సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలి

1913చూసినవారు
ప్రైవేటు ఉపాధ్యాయుల డిమాండ్ల సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలి
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణ కేంద్రంలో టిపిటిఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన డివిజన్ సమావేశానికి రవి నాయక్ హాజరై మాట్లాడారు. పాఠశాలలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ప్రాముఖ్యమైనదని, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం టిపిటిఎఫ్ డివిజన్ అధ్యక్షుడిగా రేనయ్య, తదితరులను ఎన్నుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్