ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పై అసత్య ఆరోపణలు సబబుకాదు:టిఆర్ఎస్ మండల అధ్యక్షులు

2945చూసినవారు
ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పై అసత్య ఆరోపణలు సబబుకాదు:టిఆర్ఎస్ మండల అధ్యక్షులు
శాసనసభ్యులు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పై అసత్య ప్రచారాలు చేయడం సబబు కాదని టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గజపతిరాజు విమర్శించారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా పదర మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 24 గంటలు నియెజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరిస్తూ, కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ బలోపేతానికి అనునిత్యం కృషి చేస్తున్న ఎమ్మెల్యే పైన ఇలాంటి తప్పుడు, అసత్య, అవాస్తవ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిక్కుడు వంశీకృష్ణ , ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పై చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ఎమ్మెల్యే చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక, మళ్లీ ఓడిపోతానని నిరాశలో వంశీకృష్ణ కు మతి బ్రమించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో యువత స్కిల్ డెవలప్మెంట్ భవనం కోసం నిధులు కేటాయిస్తే, ఎమ్మెల్యే అభివృద్ధి నిధులు కోచింగ్ ఖర్చు చేశారని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. వంశీకృష్ణ వాడుతున్న భాష చూస్తే ఆయన తీవ్ర నిరాశలో ఉన్నారని అర్థం అవుతుందని పేర్కొన్నారు. అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని, చట్టప్రకారం చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోలి శ్రీనివాసులు, సింగిల్ విండో డైరెక్టరీ రమేష్ యాదవ్, సునీత శ్రీనివాసులు, ఎల్లమ్మ శ్రీనివాసులు, గ్రామ అధ్యక్షుడు నారయ్య, ఎడమ వెంకటయ్య, నీలం రాజు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్