అచ్చంపేట పట్టణంలో మున్సిపల్ కార్మికులు గత మూడు నెలలుగా జీతాలు రాక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. జీతాలు చెల్లించే వరుకు విధులు బహిష్కరించి మంగళవారం మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో సి ఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మల్లేష్, మున్సిపల్ కార్మికులు కృష్ణమ్మ, వెంకటమ్మ, బాలమ్మ, అంజమ్మ, రవి, పాండు, భాస్కర్, సాయిలు, కృష్ణ, ఎల్లయ్య, గంగయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.