రేపు ఆ కాలనీల్లో పవర్ కట్
గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలోని భరత్ నగర్, మైలోని గడ్డ, కొత్త బస్టాండ్ కాలనీల్లో రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పవర్ కట్ ఉంటుందని ఏడీఈ నీలి గోవిందు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భరత్ నగర్లో అదనపు ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయడం కొరకు ఆయా కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని తెలిపారు. వినియోగదారులు గ్రహించి సహకరించాలని కోరారు.