TG: ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు.. రెండు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి స్పష్టం చేశారు. ప్రమాద స్థలికి చేరుకునేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు వివరించారు. ప్రకృతి విపత్తునును రాజకీయం చేసి లబ్ధిపొందాలనుకునే వారి గురించి నేను మాట్లాడదల్చుకోలేదని, దేశ, విదేశాల్లో ఉన్న టన్నెల్ ఎక్స్పర్ట్స్ సూచనలతో ముందుకెళ్తున్నామన్నారు.