జడ్చర్ల బస్టాండ్ లో లోపించిన పారిశుద్ధ్యం

563చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల బస్టాండ్ లో పారిశుద్ధ్యం లోపించిందని, చాలా సార్లు ఇలానే ఉంటుందని ప్రయాణికులు వాపుతున్నారు. ఆదివారం హైదరాబాద్, వనపర్తి, నాగర్ కర్నూల్ బస్సులు నిలిచే ప్లాట్ ఫాంల వద్ద మురుగునీరు, వ్యర్థాలను శుభ్రం చేయలేదని ఆవేదన చెందుతున్నారు. బస్టాండ్ ఆవరణలో దుర్వాసన ఉంటుందన్నారు. అధికారులు పారిశుద్ధ్యంపై శ్రద్ధ పెట్టాలని, బస్టాండ్ మరమ్మతులకు తగు చర్యలు చేపట్టాలనని ప్రయాణికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్