లోకల్ యాప్ న్యూస్ కు స్పందన

1805చూసినవారు
లోకల్ యాప్ న్యూస్ కు స్పందన
లీకేజీతో మిషన్ భగీరథ నీళ్లు వృధా అనే శీర్షికకు సంబంధిత అధికారులు, గ్రామ సర్పంచి స్పందించారు. నాగర్ కర్నూల్ జిల్లా పదరా మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రధాన రహదారిపై రెండు రోజులుగా మిషన్ భగీరథ మెయిన్ పైప్ లైన్ లీకేజీ కావడంతో ప్రధాన రహదారిపై చిన్నపాటి కాలువను తలపించేలా నీళ్లు వృధాగా ప్రవహించాయి. దీంతో న్యూస్ కు గ్రామ సర్పంచ్ ప్రవీణ్ కుమార్, సంబంధిత అధికారులు అప్రమత్తమయ్యారు. జెసిబి సహాయంతో లీకేజీ వద్ద పూడిక తీయించి పైప్ లైన్ కు మరమత్తులు చేయించారు. లోకల్ యాప్ న్యూస్ లో సమాచారం తెలుసుకున్న వెంటనే స్పందించిన సర్పంచ్ ప్రవీణ్ కుమార్ కు, సంబంధిత అధికారులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్