నూతన పదర ఎస్ఐ తిరుపతి రెడ్డికి సన్మానం

1247చూసినవారు
నూతన పదర ఎస్ఐ తిరుపతి రెడ్డికి సన్మానం
నాగర్ కర్నూల్ జిల్లా పదర మండల కేంద్రంలోని తెరాస నాయకులు సోమవారం నూతన ఎస్ఐ తిరుపతి రెడ్డిని శాల్వతో ఘనంగా సన్మానించారు. అనంతరం పళ్ల మొక్కను అందజేసి స్టేషన్ అవరణంలో నాటించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మండలంలోని ప్రజలు శాంతి భద్రతలకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎడమ జగపతి రాజు, ఉపాధ్యక్షుడు దాసరి ఎల్లయ్య, ఎస్సీ సెల్ వెంకటయ్య, నాయకులు మోహనయ్య, పీ. నిరంజన్, జబ్బు బక్కయ్య, నిరంజన్, పాలెంకులు, గ్రామ ప్రధాన కార్యదర్శి మహేష్, రామంజి, నీలం లింగం, బాజు తారసింఘ్, గానుగపెంట గ్రామ అధ్యక్షుడు తౌర్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్